Kohli – Axar Patel : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా (Team India) ఆరంభం బాగానే చేసినా నాలుగు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టోర్నీ అంతా బాగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఫైనల్ మ్యాచ్లో మాత్రం చాలా తొందరగా ఔట్ అయిపోయాడు. తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) కూడా అతి తక్కువ రన్స్కే పెవిలియన్స్కు చేరాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడాడు. స్కై తరువాత అక్షర్ పటేల్ను బ్యాటింగ్కు వచ్చాడు. ఒక పక్క సంయమనంగా బ్యాటింగ్ చేస్తూనే అక్షర్ ఆడపాదడపా సిక్స్లు, ఫోర్లు కొడుతూ టీమ్ ఇండియా స్కోరును ముందుకు నడిపించారు. మరోవైపు కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తరువాత కాస్త దూకుడుగా ఆడి 76 పరుగుల దగ్గర వికెట్ కోల్పోయాడు. దీని తరువాత కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగసేసరికి టీమ్ ఇండియా 176 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.
పూర్తిగా చదవండి..South Africa : నిలకడగా ఆడిన కోహ్లీ, అక్షర్ పటేల్.. సౌత్ ఆఫ్రికా లక్ష్యం 177
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
Translate this News: