తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. వరంగల్ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, ఔటర్ రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. వరంగల్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రచించాలని ఇప్పటికే రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు డీపీఆర్ లు సిద్ధం చేశారు. ముందుగా పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం శాయంపేటలోని కాకతీయ మెగా జౌళి టెక్స్టైల్ పార్క్ ను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత హన్మకొండలోని ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం నయీమ్నగర్లోని నాలా పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించే రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు.
పూర్తిగా చదవండి..రేపు వరంగల్ కు సీఎం రేవంత్
రేపు వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఓ హాస్పటల్ ను ప్రారంభించడంతో పాటు కాకతీయ మెగా జౌళి టెక్స్ టైల్ పార్క్ ను పరిశీలిస్తారు. అనంతరం.. వరంగల్ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Translate this News: