రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహిత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసింది. ఈ సభకు రాజకీయ, సినీ ప్రముఖులు, పలువురు పాత్రికేయులు హాజరయ్యారు. విజయవాడ శివారులోని కానూరులో ఏర్పాటు చేసిన ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు హజరై.. రామోజీరావుకు పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులు ఏపీ రాజధాని అమరాతి అభివృద్ధి కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి గొప్ప శక్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీరావు. ఓకే ఒక్క ఎన్టీఆర్ ఓకే ఒక్క రామోజీరావు ఉంటారు. ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది. రామోజీరావు ఏ రంగం తీసుకున్నా ఆయనకు ఆయనే సాటి. ఆయన చేసిన సామజసేవకు అనేక అవార్డులు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Ramoji Rao: అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం: చంద్రబాబు
రాజధానిగా ఒక పేరును రీసెర్చ్ చేసి 'అమరావతి' అని చెప్పి నాకు చెప్పిన వ్యక్తి రామోజీరావు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడుతూ.. రామోజీరావు పేరు మీద అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
Translate this News: