తెలంగాణలో రైతు బంధు స్కీమ్ పేరు త్వరలో రైతు భరోసాగా మారనుంది. ఎన్నికల హామీ మేరకు ఈ స్కీమ్ కింద రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించనుంది రేవంత్ సర్కార్. అయితే.. రాళ్లు, రప్పలు, వెంచర్లకు కూడా కేసీఆర్ సర్కార్ పెట్టుబడి సాయం అందించిందని.. మేం అలా చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి సంకేతాలు ఇస్తోంది. ఈ మేరకు విధివిధానాలను రూపొందించడానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కేవలం సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. సాగు చేయని వ్యవసాయ భూములకు రైతు భరోసా నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం.
పూర్తిగా చదవండి..Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఎకరాకు రూ.15 వేలు.. కండిషన్స్ ఇవే?
రైతు భరోసా స్కీమ్ విధి విధానాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. అయితే.. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు రైతుల నుంచి ప్రత్యేక ఫార్మాట్లో అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Translate this News: