లోక్సభ ఎన్నికల్లో మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేజ్రీవాల్.. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్ష కోసం మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై వాదనలు విన్న న్యాయస్థానం.. ఈరోజుకు వాయిదా వేసింది. తాజాగా ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్డడీని పొడిగించింది. ఆయన వైద్య అవసరాలను జైలు అధికారులు చూసుకోవాలని ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Arvind Kejriwal: కేజ్రీవాల్కు షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్ష కోసం మధ్యంతర బెయిల్ను పొడిగించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్డడీని పొడిగించింది.
Translate this News: