ఈమధ్య కాలంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్పోర్టులు, విద్యాసంస్థలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకోని కొందరు ఆకతాయిలు ఇలా బెదింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తం అవుతాయి. ఆ తర్వాత బాంబు బెదిరింపు బూటకమని తేలుస్తాయి. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయితే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
పూర్తిగా చదవండి..Bomb Threat: రాష్ట్రమంతటా బాంబులు పెడతాం… సీఎం, మంత్రులకు బెదిరింపులు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
Translate this News: