KCR: భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) లోకసభ ఎన్నికలకు కరీంనగర్ జిల్లా నుంచి శంఖారావం పూరించింది. ఈనెల 12వ తేదీ కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఈ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్.
పూర్తిగా చదవండి..KCR: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం..కరీంనగర్ లో 12న భారీ బహిరంగ సభ..!
బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 12 కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
Translate this News: