EVMs: మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు.. అలాగే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM)ల వాడకంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల వినియోగంపై భయాందోళన అనవసరమని అన్నారు. వాటిలో ఎవరూ కూడా ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతనపై ఆయన శనివారం లక్నోలోని సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
పూర్తిగా చదవండి..EVMs: ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్..
ఈవీఎంల వినియోగంపై భయాందోళన అనవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
Translate this News: