Nara Lokesh: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఆయన ట్విట్టర్ (X)లో జగన్ పై విమర్శలు గుప్పించారు. ” మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జగన్ తాడేపల్లి ముఠానా? టెర్రరిస్టుని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? శరత్కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టిడిపి నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం. శరత్ని తక్షణమే విడుదల చేయాలి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం. జగన్ దిగిపోయే ముందైనా ఇటువంటి సైకో చేష్టలు ఆపకపోతే, చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.” అంటూ రాసుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Nara Lokesh: సైకో జగన్ పన్నుతున్న కుట్రలు.. లోకేష్ ఫైర్!
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు లోకేష్. ఎన్నికల్లో ఓటమి తప్పదని, బలమైన టీడీపీ నేతలే లక్ష్యంగా సైకో జగన్ పన్నుతున్న కుతంత్రాలను తిప్పికొడతాం అని హెచ్చరించారు. ప్రత్తిపాటి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు.
Translate this News: