Hyderabad – Genome Valley with Rs 2,000 Crore: త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను (Gregg L. Semenza) సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో (Minister Sridhar Babu) కలిసి సెమెంజాకు అవార్డును అందించారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొన్నారు. దీని వల్ల 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.
Translate this News: