Ayodhya Ram Temple inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆహ్వానం అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిథులు, బీజేపీ నాయకుడు అర్జునమూర్తి, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు బుధవారం రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను రామాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గతేడాది ఆగస్టు నెలలో రజనీకాంత్ అయోధ్యలో నిర్మాణ దశలో ఉన్నా రామమందిరాన్ని సందర్శించారు. రామాలయం, హనుమాన్గర్హి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అయోధ్యను సందర్శించాలనే తన చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. అయితే, ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తవడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానం పంపుతోంది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఇందులో భాగంగానే.. ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆహ్వానం అందజేశారు.
పూర్తిగా చదవండి..Ayodhya: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రజనీకాంత్కు ఆహ్వానం..
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆహ్వానం అందింది. రామాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆయన్ను కోరారు. రజనీ ఇంటికి ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు సైతం వెళ్లారు.
Translate this News: