Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపాయి. ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ తమ భూములు ఆక్రమిస్తున్నారంటూ బేగంపేట బస్తీ వాసులు ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందించారు. రెక్కలుముక్కలు చేసుకుని తాము కొనుక్కున్న భూమిని ఎమ్మెల్యే దానం ఆయన అనుచరులతో కబ్జా చేయించారని ఆరోపించారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూలగొడుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే తమను హింసిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: కబ్జా నాగేందర్.. రూ.300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ..?!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు బేగంపేట బస్తీ వాసులు. భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Translate this News: