Visakhapatnam: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖలో పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్కు పంపించారు. అయితే, తనకు టికెట్ రానుందనే దాడి విరభద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దాడివీరభద్రరావు అనకాపల్లి టికెట్ను ఆశించారు. అయితే, టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలో తన కార్యకర్తలతో అనకాపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. తన నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని వీరభద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. తన రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా పంపారు. కాగా, విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం ఆయన తన రాజీనామా లేఖను పంపలేదు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా..
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖకు చెందిన కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురవడంతో.. పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారాయన.
Translate this News: