Hyderabad Drugs Case: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. న్యూఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకువచ్చిన నిందితులను పట్టుకున్నారు యాంటీ నార్కోటిక్ పోలీసులు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు గుర్తించారు పోలీసులు. పంజాబ్లోని లవ్లీ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి సూరి లీల నవీన్, వీర సాయి తేజలు అక్కడి నుంచి డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకువచ్చారు. న్యూఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రగ్స్ విక్రయిస్తున్న నవీన్, సాయి తేజను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ను సీజ్ చేశారు పోలీసులు. కాగా, వీరిద్దరూ లోన్ యాప్లలో భారీగా అప్పులు తీసుకున్నారు. ఈ అప్పులు తీర్చేందుకు తప్పుడు దారిని ఎంచుకున్నారు నవీన్, సాయి. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో తమ అప్పులు తీర్చోవాలని భావించారు నవీన్, సాయి.
పూర్తిగా చదవండి..Telangana: జూబ్లీహిల్స్లో భారీగా పట్టుబడిన డ్రగ్స్.. తొలిసారి బ్రౌన్షుగర్ పట్టివేత..
తెలంగాణలో న్యూఇయర్ వేళ భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ను సీజ్ చేశారు పోలీసులు.
Translate this News: