Anakapalli News: ఇళ్లలో చోరీలు జరడం చూశాం.. రోడ్లపై చైన్ స్నాచింగ్ చూశాం.. బండ్లలో అక్రమ రవాణా సాగించడమూ చూశాం.. మరి, ఈ చోరులకు, అక్రమ రవాణాదారులకు చెక్ పెట్టేది మాత్రం ఖాకీలే. కానీ, ఇక్కడ ఏకంగా రక్షక భట నిలయంలోనే చోరీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు బస్తాలు ఎత్తుకెళ్లారు. ఖాళీ బస్తాలు కాదండోయ్.. నిండుగా ఉన్న గంజాయి బస్తాలు. అవును, పోలీస్ స్టేషన్ నుంచి కొందరు జగత్జంత్రీలు రెండు గంజాయి బస్తాలను దొంగిలించారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రక్షణ కల్పించే రక్షకభట నిలయంలోనే ఈ చోరీ జరగడంతో.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అయితే, ఈ బస్తాలు ఎత్తుకెళ్లిన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో పలువురు పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Andhra Pradesh: జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే చోరీ చేశారు..!
దొంగలను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే.. ఈ కేటుగా మాత్రం పోలీస్ స్టేషన్లోనే దొంగతనం చేశారు. ఎలమంచిలి పీఎస్ నుంచి 2 బస్తాల గంజాయిని ఎత్తుకేళ్లారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తప్పవన్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ.
Translate this News: