CM Jagan Vidya Deevena : ఏపీ విద్యార్థులకు సీఎం జగన్(CM Jagan) గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రేపు జగనన్న విద్యాదీవెన పథకం కింద జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులను సీఎం జగన్ రేపు భీమవరం పర్యటనలో బటన్ నొక్కి డబ్బు జమ చేయనున్నారు. నేరుగా తల్లుల ఖాతాలో ఈ డబ్బు జమ కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 10 లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మొదటగా ఈనెల 12వ తేదీన కర్నూల్లో జరగాల్సిన సభను.. డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం డిసెంబర్ 29వ తేదీకి భీమవరంలో ఫైనల్ వేశారు. ఈ పథకం కోసం జగన్ సర్కార్ రూ.15,593 కోట్లు ఖర్చు చేస్తోంది.
పూర్తిగా చదవండి..CM Jagan: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్లోకి డబ్బు జమ
ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు భీమవరం పర్యటనలో జగనన్న విద్యాదీవెన నిధులను జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
Translate this News: