CM Revanth Reddy: ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సచివాలయంలో సమావేశం కానున్నారు. దీనికి తగిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి పెట్టింది. సచివాలయంలోని ఏడో అంతస్తులోని వెస్టర్న్ డోమ్లో ఈ సమావేశం జరగనుంది. క్షేత్రస్థాయిలోని సమస్యలను ఈ భేటీలో తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై కూడా చర్చ జరపనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ కార్డులు, రెవెన్యూ తో పాటి ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజాపాలన’ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు
ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Translate this News: