CM Revanth Reddy Meet : రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సచివాలయంలో కాన్ఫరెన్సు నిర్వహించను న్నారు. దీనికి తగిన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి పెట్టింది. సచివాలయంలోని ఏడో అంతస్తులోని వెస్టర్న్ డోమ్లో ఈ సమావేశం జరగనుంది. ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ మధ్యలో జరిగే ‘ప్రజా పాలన’ పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సారి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. తొలుత ఈనెల 21న నిర్వహించేలా టైమ్ ఫిక్స్ చేసి ఏర్పాట్లు చేసుకున్నా అసెంబ్లీ(Assembly) సమావేశాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు 24న నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభమైంది. సీఎంతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సైతం ఈ సమా వేశానికి హాజరుకానున్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth : రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Translate this News: