Telangana : రైతుబంధు పథకంపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుబంధు (RYTHU BANDHU) స్కీంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సాగుచేసే వారికే పెట్టుబడి సాయం ఇచ్చే యోచన ఉందని సమాచారం. డిసెంబర్ చివరి వారంలో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. స్కీంలో మార్పులపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. రైతు భరోసా సాయం చిన్న, సన్నకారు రైతులకే ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Batti Vikramarka: కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్థమే.. భట్టి ఫైర్..
RYTHU BANDHU : రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఉద్యోగులతో పాటు వారికి కట్?
రైతుబంధు స్కీమ్ పై రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబుతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగులో ఉన్న భూములకే రైతు బంధు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టే వారికి నిలిపివేత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Translate this News: