మరో మూడు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎక్సైజ్ పాలసీ (మద్యం విధానం) గడువు వచ్చేస్తోంది. ఈ నేపథ్యలోనే ఆబ్కారీ శాఖ మద్యం విక్రయాలపై దృష్టిపెట్టింది. MRP ధర కంటే తక్కువగా అమ్మకూడదని వ్యాపారులకు సూచిస్తోంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా.. నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు ఆపేయల్సి ఉంటుంది. అంతేకాదు ఈనెల 30 నాటికి ప్రస్తుతం మద్యం విధానం గడువు కూడా ముగుస్తుంది.
పూర్తిగా చదవండి..Excise Policy: తక్కువ ధరలకు లిక్కర్ విక్రయిస్తే రూ.4 లక్షలు జరిమానా..
నవంబర్ 30న ఎక్సైజ్ పాలసీ (మద్యం విధానం) గడువు ముగుస్తుండంతో.. వ్యాపారులు MRP ధరల కంటే తక్కువగా అమ్మకూడదని ఆబ్కారీ శాఖ సూచిస్తోంది. ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల జరిమాన విధిస్తామని హెచ్చరిస్తోంది.
Translate this News: