KTR Interview: హుస్సేన్ సాగర్ తీరాన గల అమర జ్యోతి వద్ద మంత్రి కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ గోరటి వెంకన్న(Venkanna) ఇంటర్వ్యూ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. నిర్వాహకుడు ఎవరనే విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. అమరవీరుల స్మారక ప్రాంగణంలో కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ నిర్వహించారు. దాదాపు అన్ని న్యూస్ చానళ్లలో, యూట్యూబ్ చానళ్లలో ప్రసారమైంది. అయితే, ఈ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇంటర్వ్యూని సీరియస్గా తీసుకున్న ఈసీ.. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఇంటర్వ్యూ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Telangana Elecitons: కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వద్ద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఇవ్వగా.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది ఈసీ.
Translate this News: