Delhi Air Pollution: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) దేశ రాజధాని ఢిల్లీ నుంచి జైపూర్కు(Jaipur) మకాం మార్చేశారు. గత కొద్ది రోజులుగా ఆమె అక్కడే ఉంటున్నారు. అయితే, రాజస్థాన్(Rajasthan) ఎన్నికల నేపథ్యంలో ఆమె అక్కడే ఉంటున్నారని, ఎన్నికల్లో ప్రచారం కోసమే ఆమె జైపూర్కు వెళ్లారనే టాక్ నడుస్తోంది. కానీ, సోనియా గాంధీ జైపూర్కు షిఫ్ట్ అవడం వెనుక కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగానే ఆమె జైపూర్కు షిఫ్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు దారుణంగా క్షీణిస్తోంది. ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ.. ఈ పొల్యూషన్ కారణంగా మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అలర్ట్ చేశారట. దాంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్ షిఫ్ట్ అయిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పూర్తిగా చదవండి..Sonia Gandhi: ఢిల్లీ నుంచి జైపూర్కు షిఫ్ట్ అయిపోయిన సోనియా గాంధీ.. కారణమిదేనట..!
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీ నుంచి జైపూర్కు షిఫ్ట్ అయ్యారు. ఆస్తమాతో బాధపడుతున్న సోనియా గాంధీ.. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా మారింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్కు షిఫ్ట్ అయ్యారు.
Translate this News: