Union Minister Kishan Reddy: కాళేశ్వరం పరిస్థితి చూస్తే గుండె రగిలిపోతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు కోసం పెట్టిన డబ్బులన్నీ రాళ్ల పాలు చేశారని విమర్శించారు. శుక్రవారం నాడు కత్రియ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ హయాంలో రూ. 30వేల కోట్లతో ప్రాణహిత పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామన్నారు. 2015లో రూ. 40వేల కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను చూసి కేసీఆర్ జబ్బలు చరుసుకున్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుది బండగా మారింది. ప్రాజెక్ట్ మొత్తం కూలగొట్టి రీ కన్స్ట్రక్షన్ చేయాలని ఇంజనీర్లు చెబుతున్నారు. పిల్లర్స్ కుంగుబాటుపై సమధానం చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రాజెక్టు విషయంలో ట్రాన్స్పరెన్సీ పాటించలేదు. ఇన్నివేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ఎవరికి లాభం? ప్రధాని మోడీ ప్రాజెక్టుల పరిరక్షణ కోసం 2021 లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీను తీసుకొచ్చారు. కాళేశ్వరం పిల్లర్ కుంగుబాటుపై తాను కేంద్ర జలశక్తి సంఘానికి ఫిర్యాదు చేశాను. వారి బృందం వచ్చి పరిశీలించి, నిన్న(గురువారం) కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.’ అని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి.
పూర్తిగా చదవండి..Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎందుకివ్వడం లేదు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి కారణంగానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ కేంద్రానికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
Translate this News: