Minister Mahender Reddy: కాంగ్రెస్ నేతలు కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన పథకాలను అమలు చేసిన తరువాత.. తెలంగాణ(Telangana)లో హామీల గురించి మాట్లాడాలని రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Minister Mahender Reddy) అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు. గురువారం నాడు కొడంగల్(Kodangal) నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో గోఖఫసల్వాద కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహేందర్ రెడ్డి.. ‘మీకు మాటలు కావాలా? చేతలు కావాలా? మాటలు చెప్పి పోయే వారి మాటలు నమ్మకండి. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: ముందు తెలంగాణలో అమలు చేసి చెప్పండి.. కాంగ్రెస్ నేతలపై మంత్రి మహేందర్ సెటైర్లు..
'మీకు మాటలు కావాలా? చేతలు కావాలా? మాటలు చెప్పి పోయే వారి మాటలు నమ్మకండి. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలి'
Translate this News: