High Tension in Yuvagalam Padayatra: ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా సైకో పోవాలి సైకిల్ రావాలి పాటను టీడీపీ నేతలు ప్లే చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు ఆ పాట వెంటనే ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు బైక్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.
పూర్తిగా చదవండి..Yuvagalam: యువగళం పాదయాత్రలో హైటెన్షన్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు
ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరదం దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
Translate this News: