ఒడిశాలోని పూరి పుణ్యక్షేత్రం భక్తుల జనసందోహంతో నిండిపోయింది. ఇక్కడ కొలువైన జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ప్రారంభం అవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతిఏడాది ఆషాడ మాసం శుక్లపక్షం విదియ రోజున జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివస్తుంటారు. దీంతో పూరి నగరమంతా భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతుంది.
పూర్తిగా చదవండి..పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం..పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు..!!
పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి పెద్దెత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో పూరి నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది. హిందూ పురాణాల ప్రకారం జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రలతో కలిసి పూరి నగరంలో విహరిస్తారు. ఈయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక చెక్క రథాన్ని సిద్ధం చేశారు.
Translate this News: