అది సెప్టెంబర్ 13, 1948.. ఉదయం 4 గంటలు.. నిజాం పాలకుల నడ్డి విరిగిన సమయం.. రజాకార్లపై భారత సైన్యం విరుచుకుపడిన కాలం..! నిజాం నుంచి తెలంగాణ ప్రజల బానిస సంకేళ్లు తెగడానికి కారణమైన ఈ ముహుర్తానికి 76ఏళ్లు పూర్తయ్యాయి. ఐదు రోజుల పాటు నిజాం సైనికులపై ఇండియన్ ఆర్మీ తాడోపెడో తెల్చుకుంది. రోజుల వ్యవధిలో హైదరాబాద్ సంస్థానం భారత్ హస్తగతమైంది.
రజకార్లను తరిమికొట్టిన భారత సైన్యం.. 76 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏమైందో తెలుసా?
1948 సెప్టెంబర్ 13న మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. ఈ సైనిక చర్య నిజాంని రాష్ట్రం నుంచి తరమికొట్టేలా చేసింది. ఇదంతా 5 రోజుల్లోనే ముగిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: