ఏపీలో వర్షాలు తగ్గడం లేదు. అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా ఉత్తరకోస్తా, ఉభయగోదావరి జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్స్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఫ్లాష్ఫ్లడ్స్ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోస్తాంధ్రలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తాలో భారీ వర్షాలు ఉంటాయని చెబుతోంది.
పూర్తిగా చదవండి..AP, TS Rains: ఏపీ, తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్!
ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లాష్ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Translate this News: