White Ration Cards: కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీపై జలసౌద లో మంత్రివర్గ ఉపసంఘం భేటి అయింది. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటూ రాష్ట్ర రెవిన్యూ, సమాచారశాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,పి.యు.సి చైర్మన్ కే.శంకరయ్య, శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న తదితరులు హాజరయ్యారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీకి అక్టోబర్ నెలలో ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈ నెలఖారుకి మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించిన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరీపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వైద్య ఆరోగ్యశాఖామంత్రి దామోదర్ రాజ నరసింహా, రెవిన్యూ మరియు సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లను సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం నియమించింది.
Telangana: అక్టోబర్ లో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ
అక్టోబర్ నెలలో కొత్త తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల పరిమితి..పట్టణ ప్రాంతలలో 7.5 ఏకారల మెట్ట భూముల ఉన్న వారికి కార్డులు జారీ చేస్తామని చెప్పారు.
Translate this News: