MLA KTR: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వాల్మీకి స్కామ్ పై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మేమన్నదే నిజమైందని అన్నారు. వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్లో నిర్ధారించిందని తెలిపారు.
పూర్తిగా చదవండి..MLA KTR: ఆ స్కామ్ డబ్బులే కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పంచారు.. కేటీఆర్ సంచలన ట్వీట్
వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. గతంలో తాము చెప్పినట్టుగానే వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు. ఈ స్కామ్లో కర్ణాటక మాజీ మంత్రి నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన చార్జిషీట్లో నిర్ధారించిందని తెలిపారు.
Translate this News: