CM Mmatha and Junior doctors: కాళీఘాట్లో సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన దీదీ మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య నమావేశం రెండుగంటలు ఆసల్యంగా రాత్రి ఏడు గంటలకు ప్రారంభం అయింది. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో 30 మంది వైద్యులు సాయంత్రం 6:20 గంటలకు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. అంతకు ముందు ముఖ్యమంత్రితో జూడాలు నాలుగు సార్లు చర్చలకు నిరాకరించారు. కానీ ఎట్టకేలకు ఇవాళ దీదీతో చర్చలు జరిపారు జూడాలు. అంతకుముందు రెండు సార్లు సమావేశం దగరగకు కూడా రాలేదు డాక్టర్లు. మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి కూర్చొని, వైద్యుల బృందం కోసం వేచి ఉన్న ఫొటో వైరల్ అయింది. కాళీఘాట్ ఇంటి లోపలికి వచ్చి కనీసం ఒక కప్పు టీ అయినా తాగమని డాక్టర్లను మమత కోరారు. కానీ డాక్టర్లు న్యాయం జరిగాకే టీ తాగుతామని చెప్పారు.
పూర్తిగా చదవండి..Kolkata: మమతా బెనర్జీ,డాక్టర్ల మధ్య ముగిసిన చర్చ..ఒక డిమాండ్పై ఏకాభిప్రాయం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రెండు గంటలపాటూ సాగిన జూడాల సమావేశం ముగిసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని జూనియర్ డాక్టర్లు చేసిన కీలక డిమాండ్ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంగీకరించిందని తెలుస్తోంది.
Translate this News: