Certificates: ఇటీవల భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాని వరదలు ముంచెత్తాయి. భారీ వరద కారణంగా ఇండ్లు, రోడ్లు నీటమునిగాయి. ఇంట్లోకి నీళ్లు చేరడంతో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు వంటి ముఖ్యమైన సెర్టిఫికెట్లు తడిసిపోవడం, మరికొన్ని చోట్ల వరదకు సర్టిఫికెట్స్ కొట్టుపోయాయి. కాగా తడిసిన సర్టిఫికెట్లను కొందరు గాలికి ఆరబెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు బాధితులకు భరోసా ఇచ్చారు. వరద నష్టం కింద రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Certificates: ముంపు బాధితులకు కొత్త సర్టిఫికెట్లు!
TG: ఖమ్మం జిల్లాలోని ముంపు బాధితులకు కొత్త సర్టిఫికెట్లు అందజేయనుంది రాష్ట్ర సర్కార్. ఈ క్రమంలో ఖమ్మం కార్పొరేషన్లో పరిధిలో 14 కేంద్రాలను, జిల్లా వ్యాప్తంగా 72 బృందాలను జిల్లా యంత్రంగం ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఈ నెల 20 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
Translate this News: