అక్రమ కట్టడాల కూల్చివేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రాకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి షాక్ ఇచ్చారు. GHMCలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తోన్న అధికారులపై ఆమె సీరియస్ అయ్యారు. ముఖ్యంగా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడటం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హైడ్రా కమిషనర్కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజువారీ కార్యక్రమాలు, విచారణల్లో విజిలెన్స్ అధికారుల అవసరం ఉంటుందని స్థాయీ సంఘం సభ్యులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..జీహెచ్ఎంసీ Vs హైడ్రా.. వారికి ఆమ్రాపాలి వార్నింగ్!
జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ పూర్తి స్థాయిలో హైడ్రా కోసం పని చేస్తున్న అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వారికి జీతాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తన ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Translate this News: