వైసీపీ సీనియర్ నేత, జగన్ కు దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం మరోసారి స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారన్న వార్తలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సారి ఆయన కండువా మార్చడం ఖాయమని తెలుస్తోంది. దసరా పండుగ రోజు పార్టీ మారడంపై బాలినేని ప్రకటన చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా జనసేన నేతలతో బాలినేని మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో మాజీ మంత్రి ఈ మేరకు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే.. పార్టీ మార్పుపై కుటుంబసభ్యులు మాత్రం తీవ్ర అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..జగన్ కు బిగ్ షాక్.. జనసేనలోకి బాలినేని?
వైసీపీ అధినేత జగన్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జనసేనలోకి చేరాలని ఆయన డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దసరా రోజున పార్టీ మార్పుపై బాలినేని ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Translate this News: