మాజీ మంత్రి రోజా పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆమె సైలెంట్ గా ఉన్నారు. మీడియాకు సైతం దూరం ఉంటూ వస్తున్నారు. ఓ దశలో ఆమె వైసీపీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా సాగింది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో వస్తున్న కొత్త పార్టీలో రోజా చేరనున్నారంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే.. ఆ వార్తలకు చెక్ పెడుతూ నిన్న వైసీపీ అధినేత జగన్ ను కలిశారు రోజా. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారిపై జగన్ కు ఫిర్యాదు చేశారు. వారు పార్టీకి ఎలా వెన్నుపోటు పొడిశారనే విషయంపై జగన్ కు రోజా వివరించినట్లు తెలుస్తోంది.
పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్!
నగరిలో గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులపై హైకమాండ్ వేటు వేసింది. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడైన కేజే కుమార్ ఉన్నారు. సీఎం జగన్ తో రోజా భేటీ అయ్యి.. 24 గంటలు కూడా కాకముందే వీరిపై వేటు పడడం చర్చనీయాంశమైంది.
Translate this News: