తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారిగా సెప్టెంబర్ 17 కార్యక్రమం జరగనుంది. దీంతో రేవంత్ సర్కార్ ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తోపాటు రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కూడా సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..Telangana: మళ్లీ సెప్టెంబర్ 17 వివాదం.. పోటాపోటీగా వేడుకలు
సెప్టెంబర్ 17ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో వేడుకలు నిర్వహించనుంది. మరోవైపు కేంద్రం వరుసగా మూడోసారి తెలంగాణ విమోచన దినోత్సవంగా పబ్లిక్ గార్డెన్స్లో కార్యక్రమం జరపనుంది.
Translate this News: