Uttar Pradesh CM Yogi Aadithya Nath: అవకాశం దొరికితే చాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్, పక్క దేశం పాకిస్తాన్ల మీద మండిపడతారు. తీవ్ర విమర్శలు చేస్తారు. ఈరోజు త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎప్పటిలానే కాంగ్రెస్ను తిట్టిపోయడమే కాక పాకిస్తాన్ ను కూడా తీవ్రంగా దూషించారు. కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే…దేశాన్ని విభజిస్తారు అంటూ విమర్శలు చేశారు యోగి. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్కి తెలుసు అని అన్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్ లాంటిదంటూ మండిపడ్డారు. దానికి చికిత్స చేసేంత వరకు భారత సమస్యలను పరిష్కరించలేమని అన్నారు. ప్రస్తుతం పీఓకే స్వేచ్ఛగా ఉండాలని మళ్లీ భారతదేశంలో కలవాలని డిమాండ్ చేస్తోందంటూ విమర్శించారు.
పూర్తిగా చదవండి..Tripura: పాకిస్తాన్..క్యాన్సర్ లాంటిది..మళ్ళీ నోరు పారేసుకున్న యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాకిస్తాన్ మీద మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్ లాంటిది అంటూ నిప్పులు చెరిగారు. త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ మీద కూడా విరుచుకుపడ్డారు.
Translate this News: