ఈ ఏడాదిలో మార్చిలో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ నిందితులు ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయం వద్ద IED బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు ఛార్జిషీట్లో పేర్కొంది. కానీ నిందితులు బాంబు పెట్టడంలో విఫలమైనట్లు పేర్కొంది. నిందితులను ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్ మరియు ముజమ్మిల్ షరీఫ్గా గుర్తించింన ఎన్ఐఏ వీళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
Also Read: భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Karnataka: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులపై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్
రామేశ్వరం కేఫ్ బాంబు దాడి కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులపై NIA ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ నిందితులు జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన రోజున కర్ణాటక బీజీపీ ప్రధాన కార్యాలయ వద్ద బాంబు పెట్టేందుకు ప్లాన్ వేసినట్లు పేర్కొంది.
Translate this News: