Khammam Floods: ఖమ్మం జిల్లాలో హైలెర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గంటగంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మైక్ ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంత్రి సీతక్క ఆ జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే మున్నేరు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి.. వారికి కావాల్సిన ఆహార, ఇతర ఏర్పాట్లను చూడలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..TG: హైఅలెర్ట్లో ఖమ్మం జిల్లా.. ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు!
TG: ఖమ్మం జిల్లాలో అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా మున్నేరు వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
Translate this News: