Manipur Violence: మణిపూర్లో కుకీ ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 229 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని నుంగ్చప్పి గ్రామంపై దాడి చేశారు. యురెంబమ్ కులేంద్ర సింఘా అనే 63 ఏళ్ల వ్యక్తిని చంపారు. దాని తరువాత మైతీ కమ్యూనిటీకి చెందిన సాయుధ గ్రూపులు, కుకీ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ కాల్పులు గురించి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అదుపులోకి తీసుకువచ్చారు.
పూర్తిగా చదవండి..Manipur: మణిపూర్లో మళ్ళీ చెలరేగిన హింస..ఆరుగురు మృతి
మణిపూర్లో మళ్ళీ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో ఈరోజు కుకీ తిరుగుబాటు దారులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. దాంతో పాటూ తీవ్రవాదులు రెండు బంకర్లను కూడా ధ్వంసం చేశారు.
Translate this News: