ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్ కోచింగ్ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారి కోసం ప్రత్యేక జాబ్మేళాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులతో పోటీ పడేలా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా శిక్షణలు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ వంటి కోర్సులు కోచింగ్ నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Telangana: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో త్వరలో ఎంసెట్, నీట్ కోచింగ్..!
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏ వంటి వాటికి శిక్షణ ఇప్పించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారి కోసం నైపుణ్యాలు పెంచి ప్రత్యేక జాబ్మేళాలు నిర్వహించనున్నారు.
Translate this News: