ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూతం గంజాయి. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కొందరు యువతీ, యువకులు గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోటు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతూనే ఉంటుది. హోటళ్లు, పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటూ చాలామంది దొరికిపోతుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయి సాగు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం పోలీసులు కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ కూడా వీటి వాడకం ఆగడం లేదు. అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం గంజాయికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగుకూ చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది.
పూర్తిగా చదవండి..Himachal Pradesh: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ.. కేవలం శాస్త్రీయ, ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Translate this News: