Ganesh Chaturthi 2024: భారత దేశంలో అత్యంత ప్రత్యేకమైన గణేష్ విగ్రహాలలో ముంబైకి చెందిన లాల్బాగ్చా రాజా ఒకటి. లాల్బాగ్చా రాజా గణేష్ మండపాన్ని ప్రతీ సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ తో సిద్ధం చేయబడుతుంది. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు వస్తారు. 1934 నుంచి లాల్బాగ్చా రాజాను ప్రతిష్ఠిస్తున్నారు. 1934లో ముంబైలోని లాల్బాగ్ మార్కెట్ లోని వ్యాపారులు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ప్రారంభించారు. ఈ గణేషుడిని ‘కింగ్ ఆఫ్ లాల్ బాగ్’ అని కూడా పిలుస్తారు.
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi 2024: ముంబై లాల్బాగ్చా రాజాకు అనంత్ అంబానీ గిఫ్ట్.. రూ.15 కోట్ల బంగారు కిరీటం!
ముంబై లాల్ బౌగ్చా రాజా గణేషుడు ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా నిలిచాడు. లాల్ బౌగ్చా రాజాను 20 కేజీల బంగారు కిరీటంతో అలంకరించారు. 15 కోట్లు విలువ చేసే ఈ బంగారు కిరీటాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చారు.
Translate this News: