ఏడు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. తెలంగాణ పీసీసీ చీఫ్ ను ఖరారు చేసింది. మహేశ్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవి కోసం రాహుల్ గాంధీ వద్ద అత్యంత పలుకుబడి కలిగిన మధుయాష్కీ గౌడ్ ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డా.. మహేశ్ కుమార్ గౌడ్ పేరు వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అత్యంత పవర్ ఫుల్ గా భావించే పీసీసీ చీఫ్ పదవికి ఆయనకు దక్కడానికి గల కారణాలు ఏంటనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. పార్టీకి విధేయతగా ఉండడం.. విద్యార్థి రాజకీయాల నుంచే కాంగ్రెస్ తో ఉండడం ఆయనకు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పూర్తి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ను ఓ సారి పరిశీలిస్తే..
Mahesh Kumar Goud: అవకాశాలు రాకున్నా నిరాశ చెందలే.. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ వరకు.. మహేశ్ ప్రస్థానం ఇదే!
28 ఏళ్ల వయస్సులోనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్ర స్థాయికి ఎదిగారు.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా.. నిరాశ చెందకుండా పార్టీ కోసమే పని చేశారు. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగిన మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ
Translate this News: