Ananthapur: అక్కా అంటూనే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తనను వేధింపులకు గురిచేశాడని ఓ వితంతువు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి రాత్రీ ఫోన్ చేసి.. ‘అక్కా’ అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు కాల్ రికార్డింగ్ చేసి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసులు నాయుడుపై శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..AP: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!
అనంతపురం జిల్లా శింగనమలలో వితంతువును ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు గురిచేశాడు. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని పదే పదే ఫోన్స్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ అతడు మాట్లాడిన ఆడియో ఆధారంగా పోలీసులను ఆశ్రయించింది.
Translate this News: