Minister Bandi Sanjay: ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం చేస్తే కనీసం స్పందించని ఒవైసీకి మహిళల మాన, ప్రాణాలకంటే ఒకవర్గం వాళ్ల ఫర్నీచర్, షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గు చేటు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆవాసీ మహిళను బండి సంజయ్ బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జయశ్రీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులతో కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా దాడికి గురవడం చూసి సంజయ్ నిశ్చేష్టులయ్యారు.
పూర్తిగా చదవండి..Telangana: జైనూర్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్
ఒవైసీ రాక్షసంగా వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం జరిగిన వెంటనే చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఈ రోజు బండి సంజయ్ పరామర్శించారు.
Translate this News: