Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించింది. ఈరోజు ఒక్కసారిగా విద్యుత్ కేంద్రంలో భారీ శబ్దాలు వినిపించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భారీ పేలుడు శబ్దాలు రావడంతో అందులో పని చేసే కార్మికులు బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ఏడో నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Srisailam Power House: శ్రీశైలం పవర్ హౌస్లో పేలుడు!
TG: శ్రీశైలం పవర్ హౌస్లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఏడో నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Translate this News: