Nara Bhuvaneswari: భారీ వర్షాలు..దానికి తోడు వాగులు, వంకలూ పొంగి పొర్లడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాతాల్లో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్నారు. వీరికి సహాయం చేసేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చారు. తెలుగు సినిమా హీరోలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం కూడ సహాయక చర్యలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెండు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈమె హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి చొప్పున ఇస్తానని అనౌన్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వరద బాధితులకు సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కోటి చొప్పున రెండు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు.
Translate this News: