మహబూబాబాద్లో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేశారు అదికారులు. ఇటీవలి వరదలకు ఇక్కడి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ రైల్వే 48 గంటల్లోనే తాళ్ల పూసలపల్లి దగ్గర ట్రాక్ ను పునరుద్ధరించింది. వందల మంది సిబ్బందిని, కార్మికులను మోహరించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. ఈ మార్గంలో నిత్యం 82 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ప్రధాన రైల్వే ట్రాక్ ఇదే. దీంతో పాటు నార్త్, సౌత్ ఇండియా మధ్య సైత ఈ రైల్వే లైన్ అత్యంత కీలకం.
పూర్తిగా చదవండి..TG Floods: హ్యాట్సాఫ్ ఇండియన్ రైల్వే.. 48 గంటల్లోనే ట్రాక్ రెడీ!
ఇటీవలి బారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ను 48 గంటల్లో పునరుద్ధరించింది ఇండియన్ రైల్వే. ఈ ట్రాక్ పై ట్రయల్ రన్ ను సైతం పూర్తి చేసింది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ ట్రాక్ పై నుంచి రైళ్ల రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది.
Translate this News: