YS Jagan: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై (Gudlavalleru College Incident) మాజీ సీఎం జగన్ స్పందించారు. వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవన్నారు. విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుగారూ (Chandrababu) ఇకనైనా మేలుకోండని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోకడంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..లోకేష్ ను కాపాడడం కోసమే.. గుడ్లవల్లేరు ఘటనపై జగన్ సంచలన కామెంట్స్!
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థ దెబ్బతిన్నదని ధ్వజమెత్తారు.
Translate this News: